
సర్వేయర్లతో మాట్లాడుతున్న జేసీ ఎ.శ్యాంప్రసాద్
సత్తెనపల్లి రూరల్: భూములు రీసర్వే వేగవంతం చేయాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి జేసీ సందర్శించారు. గ్రామ సర్వేయర్ల తో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే కు సంబంధించి ఆన్లైన్ లో ఏవిధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను తనిఖీ చేశారు. సర్వే యర్లకు పలు సూచనలు చేశారు. ఆర్డీఒ బిఎస్ఎన్ఎల్ రాజకుమారి, తహశీల్దార్ సురేష్, మండల సర్వేయర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.