
బెల్లంకొండ: మండలంలో రీ- సర్వే పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. గురువారం తహ శీల్దార్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయంలో జరుగు తున్న పనులను పరిశీలించారు. రీ - సర్వే పనులు జరుగు తున్న తీరును రెవెన్యూ అధికారులును అడిగి తెలుసు కున్నారు. రీ సర్వే పనులతో పాటు 167 ఎజి పనులు, మ్యుటేషన్ కరెక్షన్ పనులు, ఫీల్డ్ లెవల్ స్టేటస్ ను అడిగి తెలుసుకున్నారు. సత్వరం, సర్వే పనులను పూర్తి చేయాలని సర్వే సిబ్బందికి సూచించారు. సర్వే పనులను ఆర్డీవో రాజ కుమారి, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారు లకు సూచించారు. రీ-సర్వే పనులకు సంబంధించి స్టేటస్ వివరాలను సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజ కుమారి, తహశీల్దార్, మండల సర్వేయర్, సర్వే సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాశక్తి-రాజుపాలెం : మండలంలోని రెడ్డిగూడెం, చౌటు పాపాయి పాలెంలో జరుగుతున్న పనులను జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఆర్డిఒతో కలిసి పరిశీలించారు. మూడు గ్రామాలకు సంబం ధించి ఫీల్డ్ లెవల్ రిపోర్ట్ తయారు చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న నివేదికలను, వెంటనే పరిశీలించాలని రెవిన్యూ శాఖకు సూచించారు. రాజుపాలెం మండలంలో దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్ సమస్యలకు పరిష్కారమార్గం చూపించాలని సత్తెనపల్లి ఆర్డిఒను ఆదే శించారు.