
ప్రజాశక్తి - ఉంగుటూరు
కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వందాని నాగసాయిపవన్కుమార్ ఏలూరు కస్తూరీభాయి నగరపాలక బాలికోన్నత పాఠశాలలో జరిగిన ఖాదీ మహోత్సవ్ జిల్లాస్థాయి వక్తృత్వ పోటీల్లో పాల్గొని ఆంగ్ల మాధ్యమంలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయులు జి.ప్రసాదరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థిని, శిక్షణ ఇచ్చిన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు కన్నారావును ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.