Oct 30,2023 01:10

చిలకలూరిపేట: ప్రజావ్యతిరేక విధానాలను అవలం బిస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాడేందుకు సిద్ధమవ్వాలని పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అన్నారు. స్థానిక పండరీపురంలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. సమా వేశానికి యడ్లపాడు మండల కార్యదర్శి తోకల కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముం దుగా పని ఒత్తిడి కారణంగా ఇటీవల చనిపోయిన ఆశా వర్కర్‌ కృపమ్మకు, జనవిజ్ఞాన వేదిక,పార్టీ సాను భూతి పరులు జంపని శ్రీహరిబాబుకు, వామపక్ష ఉద్య మాలలో చనిపోయిన వారికి, పాలిస్తీనాలో యుద్ధంలో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ నవంబర్‌ 8వ తేదీ ఉదయం పట్టణంలోని కళామందిర్‌ సెంటర్‌లో 'చలో ప్రజా రక్షణ భేరి' జాత సందర్భంగా ఉదయం 8 గంటలకు జరిగే బహిరంగ సభను, 15వ తేదీన విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. మణిపూర్‌ ఘటనలో ప్రధాని మోదీ ఇంత వరకూ నోరు విప్పక పోవడం దారుణ మన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును ఎండగట్టాలని, జమ్మూ హోదా రద్దు, రామ మందిరం నిర్మాణం,సివిల్‌ కోడ్లు, జిఎస్‌టి వసూలు, రాష్ట్రాల హక్కులు, పన్నులను హరించేలా ఉన్నాయని విమర్శిం చారు. ఫాసిస్టు బిజెపి ప్రభుత్వ విధా నాలు, కార్మిక చట్టాలు, ఉపాధి హామీ, విద్యుత్‌ సంస్కరణలు మొదలైన అంశాల గురించి ప్రస్తావించిన ఆయన, ఆయా విధానాలు పేదలు భరించలేనివిగా ఉన్నా యన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యడవల్లి, మురికిపూడి తదితర గ్రామాల్లో దళితుల భూముల విషయంలో 2013 భూసేక రణ చట్టాన్ని మరిచి అన్యాయంగా వ్యవహరించిం దని, ప్రశ్నించిన వారిపై ఇడి, సిబిఐ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు చేయిస్తున్నారని, చివరకు విలేకరులను కూడా వదలడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పే దలకు సంక్షేమ పథకాలు కొన్ని మాత్రమే ఇచ్చారని అన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లా డుతూ బిజెపి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాకుండా ఓడిం చాలని అన్నారు. కేంద్రంలో ఏ విధానాలను అయితే అవలంబిస్తోందో తూచా తప్ప కుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమ ర్శించారు. అనంతరం మండలాల వారీగా చర్చల్లో పాల్గొ న్నారు. ఈ నెల 30,31 తేదీల్లో నాదెండ్ల,యడ్లపాడు మండలాల్లో, నవంబర్‌ నెల 2 నుంచి 6 వరకు చిలకలూరి పేట మండలంలోని గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. సమావేశంలో బి. శంకరరావు, కారుచోళ రోశయ్య, పి.భారతి, పి.శివపార్వతి, సంతోష, ఎం.కాళిదాసు, సాతు లూరి బాబు,టి. సుబ్బారెడ్డి, బి.కొటా నాయక్‌. తియ్యగూర ప్రతాప్‌ రెడ్డి,ఏ. సుబ్బా రావు,ఎం.విల్సన్‌ పాల్గొన్నారు.