Nov 03,2023 23:34

వినుకొండ: నవంబర్‌ 15 జరిగే చలో విజయ వాడ ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం శావల్యపురం మం డల కార్యదర్శి కెవిఆర్‌ మోహన్‌ చంద్‌ అధ్యక్షతన వినుకొండ రూరల్‌, నూజెండ్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు మండలాల పార్టీ సభ్యులు, అగ్జాలరి సభ్యుల సమావేశం జరిగింది. గోపాల రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఓడించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక, నిర్బంధ విధానాలపై పోరాడాలని, సిపిఎంను బలపరచాలని వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని పిలుపు నిచ్చారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.హను మంతరెడ్డి మాట్లాడుతూ అసమానతలు లేని అభివృద్ధి కోసం నవంబర్‌ 15వ తేదీ ఉదయం 10 గంటలకు బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుండి ఎంబి స్టేడియం సింగ్‌ నగర్‌ వరకు జరిగే మహాప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు. కార్య క్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, షేక్‌ నాసర్‌ బి, వై. సత్య నారాయణ, ఎన్‌.రాగిశేషమ్మ, అంజయ్య, బి.వెంకటరెడ్డి, కె. అయ్యపరెడ్డి ,శేషమ్మ భువనగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వినుకొండ: చలో విజయవాడ ప్రజా రక్షణభేరిని జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం కార్యాలయంలో వాల్‌ పోస్టర్‌ విడు దల చేశారు. వినుకొండ రూరల్‌ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, నూజెండ్ల మండల కార్య దర్శి పి.ఆశీర్వాదం, శావల్యాపురం మండల కార్యదర్శి కె.వి.ఆర్‌ మోహన్‌చంద్‌, ఈపూరు మండల కార్యదర్శి ఎం.దేవ సహా యం, బొల్లాపల్లి మండల నాయకులు ఎం.వెంకయ్య, నియోజకవర్గ సీనియర్‌ నాయకులు బి.కోటయ్య, కె. శివరామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 15న జరగబోయే ప్రజారక్షణ భేరీ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, కళా కారులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

చిలకలూరిపేట:
విజయవాడలో జరగనున్న సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయ ప్రదం చేయాలని కోరుతూ మండలం లోని పలు గ్రామాల్లో సిపిఎం నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. తాతపూడి, మురికి పూడి,బొప్పుడి,గోపాలం వారి పాలెం,రాజాపేట, మద్దిరాల, యడ వల్లి కట్టుబడివారిపాలెం, కమ్మవారి పాలెం, గోవిందపురం ,కావూరు, లింగం గుంట్ల పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ప్రభు త్వాని కి తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.
ప్రజా రక్షణ భేరి యాత్ర 8వ తేదీన చిలకలూరిపేటకు చేరుకుం టుందని చెప్పారు. స్థానిక కళామందిర్‌ సెంటర్‌ వద్ద ఉదయం ఎనిమిది గంటలకు బహిరంగ సభ జరుగుతుందని, కా ర్మికులు, కర్షకులు, అభిమానులు ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చే యాలని ఆయన పిలుపు నిచ్చారు. బహిరంగ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, ఎస్‌.పుణ్యవతి, పల్నాడు జిల్లా కార్యదర్శి విజరుకుమార్‌ తదితర ప్రముఖ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుం టూరు విజయకుమార్‌, సిపిఎం పట్టణ కా ర్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సాతు లూరి బాబు, ఎం.విల్సన్‌,బొల్లు శంకర రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

క్రోసూరు:
ధరల పెరుగుదల కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల విధానాల వల్లనే అని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి . రవిబాబు అన్నారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్ర ఉయ్యందన, గుడిపాడు, గరిక పాడు, గాదెవారిపాలెంలలో జరిగింది. రవి బాబు మాట్లాడుతూ విద్యుత్‌, బస్సు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం భారంగా మారిందని , వీటితో పాటు పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలపై ఈ భారాలు తగ్గాలంటే మోడీ ప్రభుత్వానికిి, మోడీ విధానాలకు మద్ద తుగా నిలుస్తున్న పార్టీలను ఓడించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఎం మం డల కార్యదర్శి టి.హనుమంతరావు, మం డల నాయకులు ఏపూరి వెంకటేశ్వర్లు, చిల్కా యేసయ్య, షేక్‌ముస్తఫా, నాగరాజు, శేషగిరి పాల్గొన్నారు

అమరావతి:
రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తున్న విభజన హామీలు అమలు కాలేదని అమరావతి మండల సిపిఎం కార్యదర్శి సూరిబాబు విమర్శించారు. దేశాన్ని ఆదాని,అంబానీలకు దోచిపెడు తున్నారని, బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రా ల్లో మైనార్టీలకు భద్రత లేకుండా పోయిం దని అన్నారు. కార్పొరేట్లకు సేవలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరిస్తోందని, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను రాష్ట్ర ప్రజల సం పదను అంబానీలకు పంచిపెడుతోందని అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తి చేయాలేని అసమర్థత ముఖ్యమంత్రి జగన్‌ అని విమర్శించారు.

పల్నాడు జిల్లా:
అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ బేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు డి.శివకుమారి అన్నారు.ఈ మేరకు స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ప్రజారక్షణ భేరి కరపత్రాలను ఆవిష్క రించారు. శివకుమారి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రారంభమైన బస్సు యాత్ర ఈనెల 7న పల్నాడు జిల్లాకు చేరు కుంటుందని చెప్పారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద, సత్తెనపల్లిలో బహి రంగ సభలు జరుగుతాయన్నారు. ఆయా సభలలో కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వ కార్మిక ,కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుపరచడం వలన కార్మికులకు తీవ్ర నష్టం కలుగు తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్‌ మహబూబ్‌ హుస్సేన్‌, సయ్యద్‌ రబ్బాని, వలి, షేక్‌ ఫాతిమా, షేక్‌ సుభాని పాల్గొన్నారు.