Oct 30,2023 01:13

పల్నాడు జిల్లా: అసమానతలు లేని సమాజ అభివృద్ధి సాధనకు సిపిఎం పోరాటాలు చేస్తోం దని, ప్రజా శ్రేయస్సు, దేశ, రాష్ట్ర భవిష్యత్తు కాపాడడమే తమ ముందున్న కర్తవ్యమని, ఈ నేపథ్యంలో సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు పిలుపునిచ్చారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి సిపిఎం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సరికొండ వెంకటేశ్వర రాజు అధ్యక్షత వహించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌కు సంతాపం తెలిపారు. గోపాలరావు మాట్లాడుతూ అభివృద్ధి గురించి పాలక పక్షాలు, ప్రతి పక్షాలు మాట్లాడతాయి కానీ, ఆచరణలో లేదని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వం నగదు బదిలీ పథకాలకు మాత్రమే పరిమితమైందని, దీని ద్వారా రాష్ట్రాభివృద్ధి చెం దదని అన్నారు. పల్నాడులో అన్ని వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా వెనుక బడటం ప్రభుత్వాల వైఫల్యమేనని విమర్శించారు. కార్పొరేట్‌ కుటుంబాలు, స్వామి నాథన్‌ కమిటీ సిఫార్సులు, రైతులు- మద్దతు ధరలు - రుణమాఫీ, వ్యవసాయ మోటార్లు, విశాఖ ఉక్కు పరిశ్రమ, కార్మికులు-లేబర్‌కోడ్లు, ఎపికి ప్రత్యేకహోదా, ఆరోగ్య శ్రీ , నాడు-నేడు పథకాలు, ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అంగన్వాడీల సమస్యలు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, మునిసిపల్‌ కార్మికులు సరైన వేత నాలు, గ్రామాల్లో హరితరాయబారు లకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం, బిజెపి కుట్రలు, మతోన్మాదం, మహిళలు, రాజ్యాంగం, మనుస్మృతి మొదలైన అం శాల గురించి ప్రస్తావించారు.
వైసిపి,టిడిపిి జన సేనలు మోడీ జపం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు. అన్ని రంగాలను అభి వృద్ధి చేస్తే యువత విదేశాలకు వెళ్లా ల్సిన అవసరం ఉండేది కాదన్న విషయాన్ని బిజెపి గుర్తించాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కేరళ తరహా విద్య, వైద్యం, వ్యవ సాయ రంగాల అభివృద్ధికి ఆయా పార్టీలు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, టి.పెద్దిరాజు మాట్లాడుతూ సిపిఎం ప్రణాళికపై ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యపాన నిషేధం చేసి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని వైసిపిపై విమర్శలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఏవికె దుర్గారావు, సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌,నాయకులు కోండ్రు ఆంజ నేయులు, బండారుపల్లి నాగేశ్వరరావు, రూరల్‌ శాఖ కార్యదర్శి మేడం ఆంజనేయులు, మస్తాన్‌ వలి షేక్‌ అష్రఫ్‌ పాల్గొన్నారు.