
పల్నాడు జిల్లా: అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరీ బస్సు యాత్రను జయ ప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు నియో జకవర్గంలోని పలు గ్రామాలలో గురువారం ప్రచారం నిర్వహించారు. సందర్భంగా నరసరావు పేట మండలం పాలపాడులో సిపిఎం జెండాను సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి కొమ్ముల నాగేశ్వరర ావు ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ప్రచార కార్యక్రమంలో ప్రసంగించారు. పాలపాడులో జరిగిన ప్రచార కార్యక్రమంలో విజరుకుమార్ మాట్లాడుతూ రాష్ట్రం లో 3 ప్రాంతాల నుండి బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయని ముగింపు సందర్భంగా ఈ నెల 15న విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రారంభమైన బస్సు యాత్ర ఈనెల 7న పల్నాడు జిల్లాకు చేరుకుంటుందని నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద, సత్తెనపల్లిలో బహిరంగ సభలు జరుగుతాయన్నారు. 8వ తేదీన చిలకలూరి పేటలో బహిరంగ సభ జరుగుతుందని ఆయా సభలలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రా నికి ద్రోహం చేసిన మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డి. శివకుమారి మాట్లాడ ుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ విధా నాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచడం వలన కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా వ్యవసాయ మోటార్లను స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తుంటే ఏపిలో ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు పూను కున్నారని మండిపడ్డారు. ప్రచార కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.పెద్దిరాజు, కె.రామారావు, బి.నాగేశ్వరరావు, ఎస్. వెంకటేశ్వర రాజు, బి.బాలకోటయ్య పాల్గొన్నారు.