
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై జగనన్నకు చెబుదాం కార్యక్రమం ముఖ్యోద్దేశమని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.హెల్ప్ డెస్క్ను, సుమారు 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను ఆన్లైన్ రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జాహ్నవి, నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, డిఆర్డివో పీడీ లక్ష్మీపతి, ఆర్డివో జయరామ్, డిఎంహెచ్వో హిమంత్, తహసీల్దార్ కే.విజరు కుమార్, ఎంపిడివో రామచంద్రమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ కుమార్, నక్కపల్లి సీఐ అప్పన్న, ఎస్.రాయవరం ఎస్ఐ ప్రసాద్ రావు,ఇతర శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.