Oct 30,2023 01:15

సత్తెనపల్లి: కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని సిపిఎం పట్టణ కార్యదర్శి ధరణికోట విమల విమర్శించారు. ఆదివారం పట్ట ణంలోని రంగాకాలనీ, మాస్టింగ్‌పేట ప్రాంతాలలోని గ్రూప్‌ మీటింగ్‌లలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ బిజెపి అనుసరిస్తున్న వినాశకర విధానాలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ఈ నెల 31న కర్నూల్‌లో బయలుదేరి నవంబర్‌ 7న సత్తెనపల్లి చేరుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని పిలుపు నిచ్చారు. సిపిఎం నాయకులు జడ రాజ్‌ కుమార్‌, నాణిక్య నాయక్‌, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.