Oct 05,2023 00:08

ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలోని ఏఎల్‌పురం పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ఆల్‌ ఇండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ పిలుపు మేరకు 18 బ్రాంచీల పోస్టల్‌ ఉద్యోగులు ఒక్క రోజు సమ్మె చేపట్టారు. 8 గంటల పనిదినం, పెన్షన్‌ అమలు చేయాలని, గ్రూపు ఇన్స్‌ రెన్స్‌ రూ.5లక్షలు సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 18 బ్రాంచుల ఉద్యోగులు, యూనియన్‌ నాయకులు ప్రసాద్‌, పైల కృష్ణ, గవరరాజు, చినబ్బాయి, అంబటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.