Oct 31,2023 00:25

ప్రతిజ్ఞ చేయిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌

పల్నాడు జిల్లా: 'విద్యుత్‌ పొదుపు - అభివృద్ధికి మదుపు' అనే నినాదాన్ని విద్యుత్‌వాడకందారులకు పొదుపు పాటించడం ద్వారా అల వర్చుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు నిచ్చారు. విద్యుత్‌ వాడకంపై ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఏపీ సి డిపిసిఎల్‌ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కలెక్టరేట్లోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్పందన హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెసితో పాటు ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఓ వినాయకం, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వసంత బాబు, విద్యుత్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పొదుపు ఇంధన చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ ను పొదుపు చేయడం వల్ల నిరంతరం వినియోగించుకోవడానికి, వ్యవసాయ పంటలకు 9 గంటలు, గహ వినియోగానికి 24 గంటలు వినియోగించ వచ్చునని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోడ పత్రికలు, కరపత్రాలు ఆవి ష్కరించి విద్యుత్‌ పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ నరసరావుపేట డివిజన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.