Nov 09,2023 00:09

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి -కశింకోట : మండలంలోని కశింకోట వెదురుపర్తి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ బుధవారం ప్రారంభించారు. కశింకోట కోమటివీధి, వడ్డీవీధి, మర్రిచెట్టు ఏరియాలో రూ.15 లక్షలతో నిర్మించిన డ్రైన్లు, కల్వర్టులను, రూ.15 లక్షలతో నిర్మించిన బిఆర్‌ అంబేద్కర్‌ ఎస్సీ రెల్లి కమ్యూనిటీ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను, వెదురుపర్తి గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గొల్లివిల్లి శ్రీనివాసరావు, మండల పరిషత్తు ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు ామలసాల భరత్‌ కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు