Nov 03,2023 01:06

 పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాలో సాగునీటి లభ్యత ఆధారంగా కరువు జిల్లాగా ప్రకటించాలని పల్నాడు జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపా లరావు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు సాగునీరు లేక అల్లాడి జిల్లాలోని 28 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన 103 కరువు మండలాల్లో పల్నాడు జిల్లాలో ఒక్కటీ లేదని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల పల్నాడు జిల్లాలో సుమా రు లక్ష హెక్టార్ల భూమి బీడు భూములుగా మారిపోయాయని, జిల్లాలో ఎక్కడ వరి పంట వేసే పరిస్థితి లేదని అన్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికి ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తుందని సాగునీరు పరిస్థితి, కరువు పరిస్థితిని అధికారులు నివేదికలు ప్రభు త్వానికి అందజేయడంలో ఎందుకు మేన వేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ 17 మండలాలు కరువు మండలాలుగా ప్రతిపాదించారని మి గిలిన 11 మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పశువులకు తాగు నీరు, పశుగ్రాసం అందించాలని లేకుంటే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరిం చారు. పిడుగురాళ్ల మండలం రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి. కోటేశ్వరరావు, బి.నాగేశ్వరరావు, దాచేపల్లి రైతు సంఘం నాయకులు కె.సాంబయ్య, డి.వెంకటేశ్వర్లు, ఎం.కాటమరాజు పాల్గొన్నారు.