
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : న్యుమోనియా నివారణకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివ శంకర్ అన్నారు. మంగళవారం ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో వాల్పోస్టర్ను వైద్యారోగ్య శాఖాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్క రించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి మాట్లాడుతూ 2025 నాటికి 0-5 ఏళ్ల చంటి బిడ్డల్లో న్యూమో నియా వల్ల సంభవించే మరణాలను 3 శాతానికి తగ్గించే దిశగా పటిష్టచర్యలు చేపట్టినట్లు చెప్పారు. గృహసందర్శనల్లో ఆశాలు, ఎఎన్ఎంల ద్వారా న్యూమోనియా లక్షణాలున్న పిల్లలను గుర్తించి అత్యవసర మందులు, చికిత్స చేస్తామని చెప్పారు. అవసరమైన వారికి 3 డోసులు పిసివి వాక్సిన్ 6 వారాలు, 14 వారాలు, 9వ నెలకు బూస్టర్ డోస్ తప్పక ఇప్పించా లన్నారు. న్యూమోనియా లక్షణాలున్న వారిని అత్యవసర వైద్య సదుపాయాలు గల ఆసుపత్రులకు సిఫార్సు చేస్తామని తెలిపారు. దీనిపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేసినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.గీతాంజలి తెలిపారు.
టీబీ బాధితులకు కిట్లు పంపిణీ
పవర్ గ్రిడ్ కంపెనీ సాయంతో నరసరావుపేటలో 1260 మందికి నిక్షయ మిత్ర ఫుట్ బాస్కెట్స్ను జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రవి మంగళవారం అందించా రు. ఈ సందర్భంగా డాక్టర్ బి.రవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1260 ఫుడ్ బాస్కెట్స్ ఆయా ప్రాంతాల్లో ఎంపిక చేసిన టిబి బాధితులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లా టీబీ అధికారి మాట్లాడుతూ చల్లని వాతావరణంలో ఉండొద్దని, చల్లటి ద్రవ పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరి కైనా దగ్గు జలుబు, కళ్లెలో రక్తం పడటం గమనిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టీబీ పరీక్ష చేయించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్, లెప్సరీ, టీబీ అధికారి డాక్టర్ మురళికృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిస్టిక్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రాజారమేష్, ఎస్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.