Nov 03,2023 00:58

ట్యాంకర్‌ తో పంటకు నీరు పెడుతున్న తీరును పరిశీలిస్తున్న నాయకులు

ఈపూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన పంటలు ఎండి పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అం దించి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండలంలోని బోడేశంభునివారి పాలెం, కొండ్రముట్లపాలెంకొండ్రముట్ల గ్రామాల్లో సాగునీరు లేక ఎండిన పంటలను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, అఖిలపక్ష నాయకులతో తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.రైతులు, రైతు కూలీలతో ప్రస్తుత సాగు పరిస్థితులపై ముచ్చటించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గ్రామాలలోని పంట పొలాలలో పర్య టించాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం,సాగర్‌ జలాశయాలలో తాగునీటికే సరిపడా నీరు లేవని అన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు ప్రభుత్వం మార్గ నిర్దేశం చేయాలని చెప్పారు. పల్నాడు జిల్లాలోని 28 మండలాలను కరువు మండ లాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులలో వర్షం నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు వలసలు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని దుయ్య బట్టారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్‌, ఉలవపూడి రాము,బూదాల శ్రీని వాసరావు, సిపిఎం నాయకులు మోహన్‌ చంద్‌,తెలుగు రైతు సంఘం అధ్యక్షులు ముండ్రు హనుమంతరావు పాల్గొన్నారు.