
రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్ల లో మంగళవారం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యులు శ్రీనివాస రెడ్డికి వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని బొడ్రాయి సెంటర్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం ఎదుట నిర్మిస్తున్న టిటిడి కళ్యాణ మండపాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండ పాన్ని త్వరలో పూర్తి చేస్తామని, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామంలో వైసిపి నాయకులు గంగిరెడ్డి సాంబశివారెడ్డి నూతనంగా నిర్మించిన పల్నాడు రెస్టారెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు. పి. చక్రారెడ్డి, జి.చినకోటిరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ కె. శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు పి.రవీంద్రబాబు, ఎ. పున్నారెడ్డి, సిహెచ్ సంజీవరెడ్డి, పి.రమణారెడ్డి,పి. మల్లి కార్జునరెడ్డి పాల్గొన్నారు.