Oct 25,2023 23:52

 చిలకలూరిపేట:  నైపుణ్యాభివృద్ధి కేసులో సకల శాఖల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా వైసిపి నాయకులు ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. స్థానిక టిడిపి కార్యా లయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి వ్యవహారశైలి, అవినీతిపై సొంత పార్టీ నాయకులే హైకోర్టును ఆశ్రయించి పిటిషన్‌ వేసిన సంగతి మరచి పోయారా? అని ప్రశ్నించారు. 1989 లో ఎమ్మెల్యేగా అయిన తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలవ డానికి అంబటికి ముప్పై ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్‌ వాయిదాలకు హాజరైతే శాశ్వతంగా జైల్లోనే ఉంటారని విమర్శించారు. చంద్రబాబు 17ఎ పై పోరాటం చేస్తున్నారని, జగన్‌రెడ్డి జేబు సంస్థ సీఐడీ ద్వారా దొంగ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నైపుణ్యాభివృద్ధి కేసులో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని, వెంటనే తమ పార్టీ నాయకులు వర్ల రామయ్య, పట్టాభి సవాల్‌ విసిరితే ఇంతవరకూ స్పందించ లేదని ఎద్దేవా చేశారు. భువనేశ్వరి గురించి కొడాలి నాని మాట్లాడితే తన పతనం తానే కొనితెచ్చుకున్నట్లేనని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్‌ మాట్లాడుతూ అరగంట మంత్రి అంబటికి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ భువనేశ్వరి లను విమర్శించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎ.సోంబాబు, అబ్దుల్‌ ఖుమీర్‌, గంగా శ్రీనివాసరావులు పాల్గొన్నారు.