
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుంది. టిడిపి, వైసిపి మధ్య రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్యకర్త హత్యతో గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో మరోసారి కలకలం చెలరేగింది. గురజాల మండంలోని జంగమ హేశ్వరపురం గ్రామానికి చెందిన కునిరెడ్డి కృష్ణారెడ్డి(34)ని సోమవారం రాత్రి గుర్తుతె లియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పల్నాడు జిల్లా ఎస్పి రవిశంకర్రెడ్డి వివరాల ప్రకారం.. మృతుడు కృష్ణారెడ్డి అదే గ్రామంలోని శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డి అనే అన్నదమ్ముల రెండు గ్రూపులుగా విడిపోయి గొడవలు పడుతు న్నారు. గతంలో వీరిరువురిపై కౌంటర్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో కృష్ణారెడ్డి ప్రత్యర్థి శ్రీనివాస్రెడ్డి గతంలో హైదరాబాద్ వెళ్లాడని, 22న సాయంత్రం శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డి కలిసి మద్దిమడుగు వెళ్లి అనంతరం స్వగ్రామం జంగమహేశ్వరపురం చేరుకున్నారు. సోమ వారం రాత్రి విజయదశమి సందర్భంగా బతుక మ్మను ఊరేగిస్తుండగా కృష్ణారెడ్డిని శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డి బజార్గుండా వెళ్తుంటే కాపు కాసి హత్య చేశారు. చిన్న కారణాలకే హత్య చేశారా? లేదా ఇంకేమైనా కుట్రకోణం ఉందా? అనేది దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
శ్రీనివాసరెడ్డి టిడిపిలో ఉన్నారు. కృష్ణారెడ్డి వైసిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణారెడ్డి శరీరంపై 22 చోట్ల గాయాలయ్యాయి. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి కృష్ణారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం మూడు బృందాలుగా గాలింపు చేపట్టారు. మంగళవారం జంగమహేశ్వరపురానికి వచ్చిన ఎస్పీ రవిశంకర్రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో అలర్లు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టిడిపి పనే : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మృతుడు కృష్ణారెడ్డి కుటుంబాన్ని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శిం చారు. ఓటమి భయంతోనే టిడిపి ఇలా హత్యా రాజకీయలకు తెరలేపుతోందని ఆరోపించారు. కృష్ణారెడ్డి వైసిపి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని, అందుకే అతనని హత్య చేశా రని అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపి ఇలా హత్యా రాజకీయాలు చేసి ప్రజల్ని, వైసిపి నాయకులను భయపట్టేందుకు యత్నిస్తోందని, దీనిపై ఎస్పీతో మాట్లాడానని, మఖ్యమంత్రి, డిజిపి దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు.
రాజకీయ హత్య : ఎమ్మెల్యే మహేష్రెడ్డి
కృష్ణారెడ్డిది కేవలం రాజకీయ హత్యేనని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఒ ప్రకటనలో ఆరోపించారు. వైసిపిలో అత్యంత కీలకంగా చురుకుగా పనిచేసే కృష్ణారెడ్డిని టిడిపికి చెందిన వారు హతమార్చారని, ఓటమి భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు.
వ్యక్తిగత వివాదాల వల్లే : యరపతినేని శ్రీనివాసరావు
కృష్ణారెడ్డి హత్య వ్యక్తిగత వివాదాల వల్ల జరిగిన హత్యని, అయితే దానిని స్థానిక ఎమ్మెల్యే మహేష్రెడ్డి రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హత్యకు, టిడిపికి సంబంధం లేదని తెలిపారు. 2019 వైసిపి అధికారంలోకి వచ్చాక గురజాల నియోజకవర్గంలో 11 మంది టిడిపి కార్యకర్తలు హత్య చేయబడ్డారని, ఇందుకు ఎమ్మెల్యే కారణమని, ఇప్పుడు కూడ టిడిపి వారిపై ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.