
క్రోసూరు: 'ఆరుతడులకు నీరు ఇస్తామంటే మీరు వస్తే కదా అని మిర్చి పంట వేసు కున్నాం నీరు రాక పంట ఎండిపోతుంటే కాపాడుకోవడానికి తడికి మూడు నుండి ఐదు వేల రూపాయలు ఎకరాకి ఖర్చు అవుతుంది. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కోసం తీసిన బావిలో నీటిని పీసపాడు, ఎర్రబాలెం మైనర్లకు మోటర్ల ద్వారా సరఫరా చేస్తే పంటలు కాపాడుకోవచ్చు. దిగుబడి తగ్గిన పత్తి అమ్ముకుందామంటేరూ.6,000కు అడు గుతున్నారు' అని ఎర్రబాలెం పీసపాడు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు కుటుంబాలకు భార మయ్యాయని, రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న కందిపప్పు కూడా కరువైందని వాపోయారు. ఎన్నికల అప్పుడు మాత్రమే వచ్చి మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం ఓట్లు వేయండి అని బతిమలాడుతారు, తరువాత తమ ముఖం కూడా చూడరని ఎర్రబాలెం మహిళలల ఆవేదన చెందు తున్నారు.
నియోజకవర్గంలో పంటలు కాపా డటానికి స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమీక్ష సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి . రవిబాబు అన్నారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం ఎర్రబాలెం, పారుపల్లి, పీస పాడు గ్రామాల్లో జరిగింది. ఈ సంద ర్భంగా ఆ గ్రామాల్లో వ్యవసాయ కార్మి కులు, కూలీలు,మహిళలు,రైతులు తమ సమస్యలను తెలియజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తిమ్మిశెట్టి హనుమంతరావు, మండల నాయకులు చిలక యేసయ్య,ఏపూరి వెంక టేశ్వర్లు, దగ్గు నటరాజ్,షేక్ ముస్తఫా, అత్తోట వెంకట అప్పారావు
ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయండి
ఈపూరు: రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం నాయ కులు కె.హనుమంత్ రెడ్డి అన్నారు. మం డల కేంద్రమైన ఈపూరు గ్రామంలో ఈపూరు, బొల్లాపల్లి మండలాల శాఖ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లా డుతూ బీజేపీ పాలనలో దేశం అస్త వ్యస్తంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తికావస్తున్న విభజన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణ పట్నం, గంగవరం మేజర్ పోర్టులతో పాటు రాష్ట్ర ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ కార్పొరేట్ భజన చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం కేం ద్రంతో కుమ్మక్కై విద్యుత్ చార్జీలు, స్మార్ట్ మీటర్లు,మోటార్లకు మీటర్ల,ఆస్తి పన్ను,చెత్త పన్ను లాంటి వడ్డింపులతో ప్రజల పై అధిక భారం మోపుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి కేంద్ర ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నించకుండా మోడీ నాయకత్వాన్ని సమర్థించటం సబబు కాదని అన్నారు. అధికార వైసిపి,టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో కలిసి ఆడు తున్న కపటనాటకానికి తెర దించి ప్రమాదంలో పడిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అందరూ కలిసి కట్టుగా నవంబర్ 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహి రంగ సభకు హాజరై జయ ప్రదం చేయాలని కోరారు. ఆయా సమా వేశాల్లో అమరేశం చిన గాలెయ్య, మేడికొండ దేవ సహాయం, ఇతర నాయకులు పాల్గొన్నారు.
డొల్లతనంగా జగన్ హామీలు
పిడుగురాళ్ల : జగన్ హామీలు,నవరత్నాలు మొత్తం డొల్లతనంగా ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాల రావు విమర్శించారు. స్థానిక కన్నెగంటి హనుమంతు భవనం నందు సిపిఎం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి సిపిఎం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు హాజ రయ్యారు. ఆయన మాట్లాడుతూ పల్నా డు జిల్లాలో 28 మండలాల్లో సరైన వర్షపాతం లేదని ఆరు తోటి పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పిన మంత్రి రాంబాబు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మూడు బస్సు జాతాలు ప్రారంభమవుతు న్నాయని శ్రీకాకుళం, కర్నూలు, ఇచ్చాపురం నుండి బస్సు జాతాలు ప్రారంభ మవుతాయని 30 డిమాండ్లతో రాష్ట్రంలో ప్రచారం చేయను న్నారని తెలిపారు ఈనెల ఏడో తేదీన నరసరావుపేట సత్తెన పల్లిలో జరిగే సిపిఎం బహిరంగ సభలలో పల్నాడు జిల్లా నుంచి సిపిఎం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.అలాగే ఈ నెల 15వ తేదీన విజయవాడ బహిరంగ సభకు యువతను సమాయత్తం చేసి పెద్ద ఎత్తున హాజరయ్యేలా చేయాలన్నారు. 30 డిమాండ్లను ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు.పిడుగురాళ్ల సిపిఎం నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 8,9 తేదీల్లో పట్ట ణంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తావ ుని,10వ తేదీన గ్రామాల్లో జిబుజాత ఏర్పాటు చేస్తారని అన్నారు. సమావేశంలో దాచేపల్లి సిపిఎం మండల నాయకులు ఎస్ ఆంజనేయులు రాజు,సిపిఎం సీని యర్ నాయకులు కిలారి సాంబయ్య, బుంగనాగేశ్వరరావు,దేవల్ల.భూలక్ష్మి, షేక్ బాబు, దీకొండ.వెంకటేశ్వర్లు, వెంకటరమణ,రామకృష్ణ, కే.సీతారామయ్య, జి.నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోటా సాయికుమార్ పాల్గొన్నారు.