
రొంపిచర్ల: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ , వైసిపి సీనియర్ నాయకులు గెల్లి సుబ్బారెడ్డి గురువారం తన స్వగృహంలో గుండె పోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మృతి వైసిపికి తీరని లోటు అని అన్నారు. యార్డ్ ఛైర్మన్గా, రైతులకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీ తంగా రైతు సమస్యలపై పోరాడిన ఘనత ఆయనదేనని అన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగే శ్వరరావు, రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య కూడా నివాళులర్పించారు. సుబ్బారెడ్ది పార్ధివ దేహాన్ని సంద ర్శించి నివాళులర్పించిన వారిలో సిపిఎం రొంపిచర్ల శాఖ నాయకులు సరికొండ వెంకటేశ్వరరాజు, మండల కౌలు రైతు సంఘం నాయకులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రజా వైద్యశాల డాక్టర్ నుసుం భాస్కర్ రెడ్డి, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ. మారుతి వర ప్రసాద్, సిపిఐ పల్నాడు జిల్లా నాయకులు కాసా రాం బాబు, వై. వెంకట్, చక్ర వరం సత్యనారాయణ రాజు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బత్తుల రామకృష్ణ, తదితరులు ఉన్నారు. సుబ్బారెడ్డిన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.