Oct 26,2023 19:29

స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -వెంకటాచలం :ఆదిశంకర ఇంజినీరింగ్‌ విద్యార్థులు కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టుకు సంబంధించి కసుమూరు దర్గా సెంటర్‌ వద్ద గురువారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. టీమ్‌ లీడర్లు కందుకూరు యస్వంత్‌,పి. కార్తీక్‌ ల ఆధ్వర్యంలో శుభ్రత, ఆరోగ్యం, అంటురోగాలు ప్రభలకుండా తగు జాగ్రత్తలు, సూచనలు వివరించారులక్ష్మీపతి, డి యశ్వంత్‌ , కష్ణ, సింహాద్రి, హేమంత్‌, సౌజన్య దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.