Oct 24,2023 23:41

క్రోసూరు: వర్షాభావ పరిస్థితుల వలన ఏర్పడనున్న కరువు పరి స్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధం కావాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు. మండలంలోని పెరికపాడులో మంగళవారం సిపిఎం గ్రామ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ముం దుగా ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజల స్థితి తగతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. వరి సాగు చేసే ప్రాంతంలో సాగర్‌ కాలువ నీరు రాక వరి సాగు ఆగిపోయిందని, మెట్ట వ్యవసాయం సాగు చేసే ప్రాంతంలో కూడా పంటలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, దీనివల్ల కరువు వాతావరణం ఏర్పడు తుందని అన్నారు. ఈ పరి స్థితులను ప్రజలు ఎదు ర్కోవడానికి ఉపాధి హామీ పనులను కుటుంబానికి 150 రోజులకు పెంచి పనులు ప్రారంభించడానికి సన్నద్ధం కావాలని, రేషన్‌ షాపుల ద్వారా నిత్యా వసర సరుకులు పం పిణీకి ప్రభుత్వం ప్రణాళికలు తయా రు చేయాలని కోరారు. వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్‌ ఇస్తున్నారని, 9 గంటలు ఇస్తే బోర్లు, బావుల వద్ద రైతులు సాగుచేసిన పంటలను కాపాడు కోవ డానికి అవకాశం ఉంటుందని అన్నారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి టి.హనుమంతరావు, మండల నాయకులు ఎ.ఆంజ నేయులు, శాఖ కార్యదర్శి ఎం.పౌలు, డి.నటరాజ్‌, జె. పేతురు, ఎస్‌.దిలీప్‌, జె.సుబ్బు, జె.కిరణ్‌ పాల్గొన్నారు.