
క్రీడాకారులకు అభినందనలు
ప్రజాశక్తి -కొత్తకోట:రాష్ట్ర స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలలో ప్రతిభ చూపి ఉమ్మడి విశాఖ జిల్లా జట్టును ప్రధమ స్థానంలో నిలిపిన టి.అర్జాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులను బుధవారం పలువురు అభినందించారు. బాల్ బాడ్మింటన్ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు కర్నూలు జిల్లా మహానందిలో సెప్టెంబరు 30, అక్టోబరు 1,2 తేదీలలో జరిగాయి. ఈ పోటీలలో పాఠశాలకు చెందిన మత్సభాగ్య, మలిచెట్ల భీష్మునందిని పోటీలలో అత్యంత ప్రతిభ కనబర్చి ఉమ్మడి విశాఖ జిల్లా జట్టును ప్రధమ స్థానంలో నిలిపారు. బుధవారం పాఠశాలకు వచ్చిన వారిద్దరినీ ఆ పాఠశాల కమిటీ చైర్మన్ ఎం. శివయ్యనాయుడు, హెచ్ఎం ఎంకె ఆర్ఎస్ నాయుడు, పిడి రమేష్ నాయుడు, సిఆర్ఎం టి. గుంటూరు రామారావు, ఉపాధ్యాయులు జిపిఎస్ నాయుడు తదితరులు అభినందించారు.