Oct 07,2023 00:28

కాగడాల ప్రదర్శనలో పాల్గొన్న టిడిపి నాయకులు

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యాన దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రజాశక్తి-భీమునిపట్నం

భీమిలిలోని టిడిపి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు శుక్ర వారం నాటికి 27వ రోజుకు చేరుకున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఎం.లక్ష్మణరావు, జి.పోలిరాజు తదితరులు పాల్గొన్నారు.
ములగాడ : జివిఎంసి 62వ వార్డు పరిధి త్రినాధపురం జంక్షన్‌ నుంచి గుడివాడ అప్పన్న కాలనీ గాంధీ విగ్రహం వరకు వార్డు అధ్యక్షులు మజ్జి మాలినాయుడు ఆధ్వర్యాన కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీతారాం, లాలం లావణ్య, సన్యాసిరావు, నరసింగరావు, కోరిబిల్లి రాము, హరికుమార్‌, అప్పన్న, చంద్రశేఖర్‌, ఆది, హరిహర రాజు, వాసు, దిలీప్‌, రాము, సూర్యనారాయణ, శ్రీను, శ్రీధర్‌, లక్ష్మి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి, జనసేన పార్టీల కార్యకర్తలు శుక్రవారం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని గొల్ల వీధి, స్టేషన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాధంశెట్టి నీలబాబు, కుప్పిలి జగన్మోహన్‌, బోడీ వెంకట్రావు, జనసేన నాయకులు శ్రీకాకుళం జగ్గారావు, కోట్ని సూరిబాబు, కొమ్మోజు రాజు, రోకలి తాతారావు తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని ఏనుగు తుని గ్రామంలో శుక్రవారం బాబుతో నేను కరపత్రాలను టిడిపి నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టిడిపి నాయకులు గొంతుని శ్రీనివాసరావు, కాయల మురళి, ఉ గ్గిన రమణ మూర్తి, వేగి గోపీకృష్ణ, గొంతిన నూకరాజు, ఎంపీటీసీ షేక్‌ దర్గా, మజ్జి నిరంజన్‌ కుమార్‌, కర్రి దుర్గి నాయుడు, నైనం శెట్టి రమణ రావు, ఉల్లింగల రమేష్‌ పాల్గొన్నారు.