
ప్రజాశక్తి -యంత్రాంగం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన బాబుతో నేను కార్యక్రమం ఆదివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొనసాగింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ నేతలు నినాదాలు చేశారు.
కశింకోట:కశింకోట మండలం చింతలపాలెంలో ఇంటింటి వెళ్లి బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్లు కర్రి దుర్గ నాయుడు, మేడిశెట్టి వెంకట రమణ, జెర్రిపోతుల నూకునాయడు, బుద్ధిరెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
చోడవరం రూరల్ : బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా మండలంలోని గవరవరంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. టిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తుల తాతయ్యబాబు, నాయకులు గూనూరు మల్లునాయుడు, బొడ్డేడ నాగగంగాధర్, మాజీ ఎంపిపి గూనూరు పెదబాబు, గవరవరం మాజీ సర్పంచ్ ఎం.వెంకట స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం : మేము సైతం చంద్రబాబు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆరిపాకలో స్థానిక టీడీపీ నాయకుడు వి.రమేష్ రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, గండి రవి కుమార్, గండి ముత్యాల నాయుడు, గండి దేముడు, బర్ణికాన బాబురావు, కోటాన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : మండలంలో బవులవాడ దర్జీ నగర్ కాలనీలో టీడీపీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆదివారం ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కోట్ని బాలాజీ, మళ్ళ సురేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.
నక్కపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ విమర్శించారు. మండలంలోని రాజయ్యపేట సముద్ర తీరంలో ఆదివారం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టిడిపి, జనసేన శ్రేణులు సంయుక్తంగా నిరసన చేపట్టారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు, డిఎల్ పురం ఎంపీటీసీ సభ్యులు కనకారావు, రాజయ్యపేట గ్రామ శాఖ అధ్యక్షులు పిక్కి గంగరాజు, నాయకులు పిక్కి సత్తియ్య, బాబూరావు, రాంబాబు, లోవరాజు, చిన్నారి, గోపి, రామకష్ణ, బుజ్జి, అప్పలరాజు, కోదండరావు, రమణ, అప్పారావు, రాజారావు, తాతాజీ పాల్గొన్నారు.
రోలుగుంట:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలో ఎంపిటిసి సుర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హారన్ మోత మోగిస్తూ గ్రామ పురవీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
గొలుగొండ:చంద్రబాబునాయుడు అరెస్ట్కు నిరసనగా మంండలంలోని లింగంపేట పంచాయతీలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మరిసా వెంకటరమణ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, పార్టీ సీనియర్ నాయకులు చిటికెల సాంబమూర్తి, లింగంపేట సర్పంచ్ ఆదపురెడ్డి గోపాలకృష్ణ, మాజీ సర్పంచులు పరవాడ అప్పలనాయుడు, ఆదపురెడ్డి ప్రభాకర్, లగుడు నానిబాబు, అనకాపల్లి జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు గోలకొండ శ్రీకాంత్, గొర్లి సత్తిబాబు, లగుడు సత్యవేణి, అగ్రహారపు రత్నం, మిడతాన సూరిబాబు, గొంతిన తాతాజీ, ఎం నర్సింగ్ రావు, మాజీ నూకాంబికా ట్రస్ట్ చైర్మన్, నెల్లూరు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : విశాఖ టిడిపి కార్యాలయంలో 72 గంటలు నిరాహార దీక్ష చేపట్టిన టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎంవి.ప్రణవ్గోపాల్, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు సర్వసిద్ధి అనంతలక్ష్మి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మొల్లేటి కుమార్ స్వామి, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఊరుకూటి డేవిడ్, కోట నరేష్, షేక్ రహమతుల్లా, పాశర్ల తరుణ్, ఆదిత్యలకు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జి ఆదివారం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.