
ప్రజాశక్తి - భీమడోలు
గతంలో జరిగిన వివిధ విశేషాలను, అంశాలను వర్తమాన కాలానికి తెలియజేసేందుకు, పరిచయం చేసేందుకు ఫోటోగ్రఫీ సహకరిస్తుందని, దీని సృష్టికర్త డాగ్యురే ధన్యజీవి అని భీమడోలు ఏరియా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మరావు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో భీమడోలులోని సంతపేటలో ఏర్పాటు చేసిన శాస్త్రవేత్త అబ్దుల్ కలాం, డాగ్యురే వేదిక వద్ద శనివారం డాగ్యురే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు డి.శ్రీరామ్, కార్యవర్గ సభ్యులు ఎవి.రంగారావు, పి.రమణ ఆధ్వర్యంలో సంఘ పరిధిలోని మూడు మండలాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు డాగ్యురే విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.