
ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఆటలు కూడా భాగం కావాలని, ఆటల ద్వారా ఆరోగ్యంతో పాటు వినోదం అందుతుందని కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు అన్నారు. నరసరావుపేట పట్టణం చిలకలూరిపేట రోడ్డులోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. వర్సిటీ పరిధిలోని 23 పురుషుల జట్లు పాల్గొన్న ఈ పోటీలను వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ డాక్టర్ పి జాన్సన్, కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాతాని మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఒత్తిడి ఆందోళనలు తగ్గుతాయన్నారు. శారీర కంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలలో మెదడు పనితీరు చురుకుగా ఉంటుందన్నారు. యాంత్రి కంగా పుస్తకాలు చదవడం, సెల్ ఫోన్, టీవీలతో గడిపే పిల్లలతో పోలిస్తే ఆటలు వాడే వారిలో భావోద్వేగాలకు వ్యత్యాసం ఉంటుంద న్నారు. తమ కళాశాలలో అవలంబిస్తున్న విద్యా బోధన మౌలిక సదుపాయాల కల్పనలు పరిశీలి ంచిన నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) ఇటీవల ఏ గ్రేడ్ గుర్తింపు లభించిం దన్నారు. పోటీలను కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శిలు డాక్టర్ బుజ్జి, డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
తొలిరోజు విజేతలు
ఇదిలా ఉండగా తొలిరోజు జోటీల్లో నరసరావుపేట పాలడుగు నాగయ్య చౌదరి కొత్త రఘురామయ్య కళాశాలపై గుంటూరు జెకెసి కళాశాల గెలుపొందింది. ఆర్ విఆర్ జెసి కాలేజీ గుంటూరుపై ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నాగార్జున సాగర్ విజయం సాధిం చింది. నరసరావుపేట శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కళాశాలపై బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల గెలుపొందింది. రేపల్లె ఏబీఆర్ ప్రభు త్వ డిగ్రీ కళాశాలపై చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విజయం సాధించింది. సత్తెనపల్లి అన్నం గురవమ్మ కృష్ణమూర్తి కళాశాలపై పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ధనలక్ష్మి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలపై విక్టరీ డిగ్రీ కళాశాల గెలుపొందింది.