రక్తదానం చేస్తున్న కానిస్టేబుల్
ప్రజాశక్తి-కందుకూరు :విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం తణప్రాయంగా అర్పించి అమరులైన పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండి పసికర్లతో బాధపడుతున్న ఓ పాపకి అవసరమైన రక్తదానం చేసి పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వన్య. ఈ సందర్బంగా రక్తదానం చేసిన కానిస్టేబుల్ వన్యను పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.










