Oct 09,2023 16:43

ప్రజాశక్తి-అనకాపల్లి : ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ  అరెస్టు, జర్నలిస్టుల ఇళ్లపై  దాడులను నిరసిస్తూ  ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో జర్నలిస్టులు  ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్  జిల్లా గౌరవాధ్యక్షులు జి.కాంతారావు  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని కక్ష కట్టి ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఎడిటర్  ప్రబిర్ పురాక్కయస్థను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని  అన్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమాలకు అనుకూలంగా, ప్రజల ప్రయోజనాల కోసం కథనాలు ఇవ్వడాన్ని భరించలేక అక్రమంగా ఉపా కేసులు బనాయించిందని అన్నారు. మీడియాపై దాడులు,అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. పురకాయస్థ, ఇతరులపై పెట్టిన ఉపా కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్,  అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి. కొండలరావు, కార్యదర్శి పి‌. రామకృష్ణ, యూనియన్ ప్రతినిధులు పి. అజయ్,గంట శ్రీనివాసరావు, బాషా, రాజా,  రమేష్,పి.నాగ, కె. మోహన్ బాబు, పి. రామారావు, కె. గణేష్, పి. సత్యనారాయణ, నటరాజ్, గంగాధర్, బొడ్డేడ శ్రీను,నాయుడు, కుమార్,మణి కుమార్,ఎన్. వెంకటరమణ,,దేవుడు బాబు, స్వామి, 
బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.