Oct 29,2023 00:04

నేవీ గోడ కట్టడానికి సిద్ధం చేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న నేతలు

ప్రజాశక్తి-రాంబిల్లి
మండలంలోని పెదకళవలపల్లి గ్రామాన్ని అనుకొని జిరాయితీ భూముల్లో నేవీ అధికారులు ప్రహరీ నిర్మాణం చేయడం అన్యాయమని పెదకళవలపల్లి మాజీ ఎంపిటిసి రావి దేముడు, సిపిఎం మండల కన్వీనర్‌ జి దేముడునాయుడు అన్నారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఇల్లు, కల్లాలు, జిరాయితీ భూముల్లో నుండి చేపట్టిన గోడ నిర్మాణ పనులను బాధితులు అడ్డుకున్నారు. శనివారం గోడ నిర్మాణ ప్రాంతాన్ని ఎంపిటిసి రావి దేముడు, దేముడు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి చెట్లు, కల్లాలు, ఇల్లు నిర్మించుకొని, ఉపాధి పనులు చేసుకుని, పాడిపశువులు, గొర్రెలు మేకలు పెంచుకొని జీవనం సాగిస్తున్న బాధితులకు అధికారులు గాని, నేవీ వారుగాని ఎటువంటి సమాచారం ఏ విధంగా అక్రమ కడతారని ప్రశ్నించారు. ఇలా అయితే బాధితులు ఎలా బతకాలన్నారు. ప్రజలకు న్యాయం చేయవలసిన అధికారులు పాలకులు వారి జీవితాలు లాక్కోవడం అన్యాయమన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ఈ విషయంపై వెంటనే స్పందించాలని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.