Nov 13,2023 21:32

ఫొటో : మాట్లాడుతున్న జెవివి నాయకులు

జెవివి సన్నాహక సదస్సు
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యావ్యవస్థలో ఏ పద్ధతిలో విద్యార్థులకు విద్యను బోధించాలో అనే అంశంపై ఫిజిక్స్‌, బయాలజీ, సోషల్‌ ఉపాధ్యాయులకు సైన్స్‌ క్లాసుల బోధనపై సన్నాహక సమావేశం నిర్వహించినట్లు జెవివి నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ ఆవరణం జిల్లా కమిటీ సభ్యులు జెవివి సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెవివి రాష్ట్ర నాయకులు జి.సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న ఈ విద్యా వ్యవస్థ ఏ పద్ధతిలో విద్యార్థులకు విద్యను బోధిస్తే వారి ప్రాపంచక దృక్పథం శాస్త్రీయ దృక్పథానికి అనుకూలంగా ఉంటుందో అందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించామ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిజిక్స్‌, బయాలజీ, సోషల్‌ టీచర్స్‌కు కొన్ని సైన్స్‌ క్లాసులు నిర్వహిస్తున్నా మన్నారు. ఇప్పటికే విద్యార్థులకు సైన్స్‌ అందుబాటులో ఉన్నందున ఇంకా ఆసక్తి కలిగే విధంగా చెప్తే బాగుంటుందన్నారు.
మన చేతుల్లో ఉన్న మొబైల్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం చాలా స్పీడ్‌గా మనకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది ఒక శాస్త్రీయ విజ్ఞానం ద్వారానే సాధ్యమైందన్నారు. అయితే ఇదే శాస్త్రీయ విజ్ఞానాన్ని వాడుకొని కొన్ని అశాస్త్రీయ భావజాలాన్ని అంతే స్పీడుగా రూపొందిస్తున్నారని తెలిపారు. ఇటీవల చంద్ర మండలానికి చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగించి నట్లు తెలిపారు. ఇప్పుడున్న మోడ్రన్‌ సైన్స్‌ ద్వారా రూపొందించి సైన్స్‌ ద్వారానే చంద్ర మండలానికి రాకెట్‌ను పంపించినట్లు తెలిపారు. కొందరు పురాతన కాలం నాటి వేదాలలో ఉన్న వాటిని ఉపయోగించి పంపించినట్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసి విజయం సాధించడం మత్రమే కాకుండా వాళ్ల నిత్య జీవితంలో కూడా ఈ సైన్స్‌ను వాడి ఎలా విజయం సాధించాలనేదే ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుమ్మిత శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షు లు డాక్టర్‌ గౌస్‌ బాషా, జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్‌ దస్తగిరి అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, జెవివి నాయకులు గాజుల ఫరూక్‌ అలీ, మైనుద్ధిన్‌, రంతూ జాని, తదితరులు పాల్గొన్నారు.