
మాచర్ల: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో నిత్యావసరాల ధరలు హద్దులు దాటి పెరుగుతున్నాయని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ డివిజన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిత్యావసరాల అధిక ధరలతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను అదుపుచేయడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక విధా నాలు, అధిక ధరలకు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాటాలకు కదిలిరావాలని పిలుపు నిచ్చారు. అయిల్, గ్యాస్ ధరలు కూడ ప్రజలు భరించలేని విధంగా ఉన్నట్లు వివరించారు. వీటి ప్రభావం వలన నిత్య వసరాల ధరలు కూడ విపరీతంగా పెరుగుతున్నట్లు వివరించారు. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలను అవ లంబిస్తోందని, వెంటనే నిత్యవసరాల ఎగుమతులను నిషే ధించాలన్నారు. నిరుద్యోగులు ఎదుర్కోంటున్న సమస్యలు, ప్రజలపై పడుతున్న భారాల సమస్య, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జగన్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదని విమర్శించారు. నిరుద్యోగులు ఎదుర్కోంటున్న సమస్యలు, ప్రజలపై పడుతున్న భారాల సమస్య, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జగన్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కార్పొరేట్ సేవలో తరిస్తూ కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు రాష్ట్ర ప్రజల సంపదను వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. సిఎస్టిబిసి కార్పోరేషన్ను ఏర్పాటు చేసి కీలుబొమ్మను చేసినట్లు తెలిపారు. వాటికి నిధులు కేటయించలేదన్నారు. నిరు ద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి ఎప్పుడు వేస్తారో తెలియటం లేదన్నారు. రాష్ట్రంలో నెలకన్న వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో రైతులకు ఎలాంటి మేలు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. మాచర్ల ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం వరికపూడిశెల ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో వెంటనే చెప్పా లని, ఇటువంటి సమస్యలన్నింటిపై సిపిఎం ప్రచార జాతాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు, లేబర్ కోడ్స్, మతవిద్వేషాలు, విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ, మూడు రాజధానుల పేరిట ప్రజలను మోసం చేయడం, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు, ప్రజలపై పన్నుల భారాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మొదలైన అంశాల గురించి విజయకుమార్ ప్రస్తా వించారు. వచ్చే నెల 7న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు రానున్న ప్రజా రక్షణ భేేరి బస్సు యాత్రకు ఘన స్వాగతం పలకడంతో పాటు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 15వ తేదీన విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ ద్వారా ప్రభు త్వాలను నిలదీయనున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రచార జాతాలకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు నాయక్ స్థానిక నేతలు బండ్ల మహేష్, వై.సురేష్ వెంకటరత్నం, శోభన్కుమార్ పాల్గొన్నారు.