Oct 20,2023 11:29
  • అదికారం ఉంటేఎదైన చేయోచ్చా

ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి గ్రామాపంచాయిలో గ్రామకంఠాలు అమ్మకానికి అదిపతి ఎవరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న ప్రశ్నించారు, శనివారం అయిన ఓప్రకటన విడుదల చేసారు దేవరాపల్లి గ్రామపంచాయతీలో విచ్చలవిడిగా గ్రామకంఠం అమ్మకాలు జరుగుతున్న సంభందించిన అదికారులు కళ్ళు అప్పగించుకోని చూస్తూరని తెలిపారు గతంలో కోబ్బరితోట, డంపింగ్ యార్డును, అన్యాక్రాంతం చేసి అమ్మకాలు చేపాట్టినప్పుడు సిపిఎం అడ్డుకోవడంతో డంపింగ్ యార్డు స్తలంలో సచివాలయం కోబ్బరితోట స్తలంలో హెల్త్ సబ్ సెంటర్ రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారని ప్రస్తుతం పాత డంపింగ్ యార్డు స్తలంలో లక్షలాది రూపాయలు విలువ చేసె స్తలంను అన్యాక్రాంతం చేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు, ఇప్పటికే పెదలకు ఇల్లు స్తలాలు పేరు చేప్పి పేదలనుండి లక్షలాది రూపాయలు ఆర్జించి పేదలకు ఇల్లు స్తలాలు ఇచ్చినట్లు చూపించారని ప్రస్తుతం లక్షలాది రూపాయలు విలువ చేసె గ్రామకంఠాలను అన్యాక్రాంతానికి సిద్ధం చేసారని తెలిపారు ఇంతటి దౌర్బగ్యపు పరిస్థితి మనుపు ఎన్నడు లేదని ఉపముఖ్యమంత్రి సోంతమండలం అవ్వడం అయిన అండదండలతో ఇటువంటి బరితెగింపుకు పూనుకుంటున్నారని వెంటనే అదికారులు జోక్యం చేసుకొని గ్రామకంఠాలు అమ్మకాలు ఆపాలని అమ్మకానికి అదిపతి ఎవరో నిగ్గు తెల్చాలని వెంకన్న డిమాండ్ చేసారు.