Oct 13,2023 11:03
  • బదిలీ అయిన ఉపాధ్యాయులకు మూడు నేలలుగా చెల్లించని జీతాలు
  • జీతాలు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు

ప్రజాశక్తి-దేవరాపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు పైకక్ష సాదింపు చర్యలకు పూను కుంటుందని బదిలీ ఆయన ఉపాద్యాయులకు మూడు నేలలు నుండి జీతాలు చేల్లించలేదని దీనికి ప్రభుత్వం తగిన మూల్యం తేల్లించక తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. జీతాల కోసం ప్రతినెల ఎదురు చూడటం అనే సమస్య పరిష్కారం చేయాలని, సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ 60% ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్ కి చెల్లించబడ లేదని,వెంటనే చెల్లించడానికి చర్యలు చేపాట్టాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు. పాఠశాలల్లో విద్యార్దిని విద్యార్థులకు పరిక్ష పేపర్లుకు స్టేషనరీ ఖర్చులు కూడా చేల్లించలేని దిక్కు మాలిన స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పిల్లలకు కోచిన్ పెపర్ ను సెల్ పోన్లో వాట్సాప్ లో పెట్టి పిల్లలకు బోర్డు పై వ్రాయమంటున్నారని తెలిపారు. ఇంతటి దౌర్జనానికి ప్రభుత్వం దిగజారి పోతోందిని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో సగం మందికి కూడా డబ్బులు అంద లేదన్నారు. ఇంటి ఖర్చులు,మందులు కొను గోళ్ళుకు పండుటాకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అగ్రహారం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన కార్యక్రమాలు చేపాడుతున్నారని కక్ష పూరితంగా ప్రభుత్వం వ్వహరిస్తుందని తెలిపారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికే ఈ నెల జీతాలు అందాయని ఈ నెల 13 తేదీ వచ్చినా అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జీతాలు, పెన్షన్ డబ్బులు జమ కాలేదన్నారు. జీతాల డబ్బులు ఎప్పుడు పడతాయా అని గంట కోసారి బ్యాంకు ఖాతాలను చెక్ చేసు కుంటున్నారని అయిన అవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా పెన్షన్ డబ్బులపైనే ఆధార పడిన రిటైర్డ్ ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శుక్రవారం నాటికి జిల్లాలో పది కన్నా తక్కువ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే జీతాలు అందాయని తెలిపారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 19 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని. ఆయా శాఖల డ్రాయింగ్ అధికారుల ప్రతి నెలా 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉద్యోగుల జీతాల బిల్లులను ఖజానా శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటారని జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులకు ఒక నెల జీతాలు చెల్లించాలంటే రూ.75 కోట్లు నుంచి రూ.85 కోట్లు అవసర మోవుతాయని, ఈనెల 13 తేదీ ముగిసినప్పటికీ జిల్లాలో సగం మంది ఉద్యోగులకు కూడా సెప్టెంబరు జీతాలు అందలేదన్నారు. పెన్షనర్ల విషయానికి వస్తే సెప్టెంబరు నెలకు సంబంధించి జిల్లాలో ఎనిమిది వేల మందికిపైగా పెన్షనారులు ఉన్నారని. వీరిలో నాలుగు,నాలుగు వేల మందికి మాత్రమే చెల్లింపులు జరిగాయని తెలిపారు. విద్యాశాఖ పరిదిలో సుమారు 12 వేల మందికి పైగా ఉపాధ్యాయుల బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు ఒక్క టీచరు కూడా. సెప్టెంబరు నెల జీతం బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదన్నారు బదిలీ అయిన ఉపాధ్యాయులకు మూడు నేలలు నుండి జీతాలు చేల్లింపులు జరగ లేదన్నారు. ప్రతి నెల జీతాల చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుండడం వల్ల వ్యక్తిగత అవసరాలకు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు సంబంధించిన నెలవారి వాయిదాలు (ఈఎంఐ) సకాలంలో చెల్లించ లేకపోతున్నారని, దీంతో అదనపు వడ్డీ పడుతుందని తెలిపారు రానున్న రోజుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం ఎక్కువ ఉంటుందని తెలిపారు. గతంలో ఒకటి రెండో తేదీల్లో జీతాల డబ్బులు అందేవని, కానీ కొన్ని నెలల నుంచి ఆ పరిస్థితి లేదన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వని ప్రభుత్వాలను గతంలో ఎన్నడు చూడలేదని అవింగా చేసిన ఏ ప్రభుత్వానికి మనుగడ లేదన్నారు. ప్రతీ నెల జీతాల కోసం ఎదురు చూసేలా చేస్తే  దీనికి తగిన  మూల్యం ప్రభుత్వం చేల్లించుకోకా తప్పదని వెంకన్న హెచ్చరించారు,వెంటనే జీతాలు చేల్లించాలని డిమాండ్ చేసారు.