Oct 29,2023 00:44

సత్తెనపల్లి: గుండెపోటుతో పని ప్రదేశంలో భవనిర్మాణ కార్మి కుడు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లిలో శుక్రవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సెగ్గం శ్రీను (53)సత్తెనపల్లి పట్టణంలో గత 35 సంవత్స రాలుగా తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగి స్తున్నాడు. యథాప్రకారం వడ్డవల్లిలో బిల్డింగ్‌ నిర్మాణం పనులు భాగంగా రెండవ అంతస్తు పైకి వెళ్లి పనిచేస్తుండగా గుండెపోటుకు గురైన శ్రీను, పని ప్రదేశంలోనే కుప్పకూలి పోయాడు. దీంతో తోటి కార్మి కులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పట్టణం లోని స్వగృహానికి తరలించారు. అంత్యక్రియలు నిర్వహించారు.మృతుడు శ్రీనివాసరావు కుమారుడు గత ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాగా, శ్రీనుకు భార్య, కుమార్తె ఉన్నారు.
శ్రీను మృతదేహానికి నివాళులు
ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాద్‌రావు శనివారం శ్రీను మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతుడు సెగ్గం శ్రీను గత 35 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడని అకస్మాత్తుగా శ్రీను మరణించ డంతో ఆయన కుటుంబం రోడ్డున పడకుండా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.5 లక్షలపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీను మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో తోటి భవన నిర్మాణ కార్మికులు గోన కోటేశ్వరరావు, చిలకా శ్యామ్‌, యాసారపు జాకోబు,కన్నదార ప్రతాప్‌, దూళ విజయబాబు,పసుపులేటి అనిల్‌ కుమార్‌, రాజారపు తిరుపతిరావు,మరిఅదాసు,లాగా రాంబాబు, సెగ్గం శ్రీనివాసరావు, సంగెపు వెంకటేశ్వర రావు నివాళులర్పించారు.