
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:మండలంలోని సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హేమంత్ సందర్శించారు. మండల కేంద్రంలో జరిగిన ''జగనన్నకు చెబుదాం'' కార్యక్రమంనకు హాజరైన ఆయన పి.హెచ్.సిని సందర్శించారు. ఆసుపత్రికి సంబంధించిన రికార్డులు, ఫీల్డ్ రికార్డులను తనిఖీ చేసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు, గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీలకు, ఇతర ఫీల్డ్ సిబ్బందికి దిశా, నిర్దేశం చేశారు. గర్భిణీల, ప్రసవాల నమోదు, వ్యాధి నిరోధక టీకాలు, రక్త హీనత కలిగిన పిల్లలు, కౌమార బాల, బాలికల వివరాలు నమోదుపై దృష్టి సారించాలని సూచించారు. అంతరం మెడికల్ ఆఫీసర్లు ఎస్ఎస్వి శక్తి ప్రియ, వాసంతిలతో మాట్లాడారు.స్థానిక ఎం.పి.యు.పి స్కూల్ ను సందర్శించి రక్తహీనత కలిగిన విద్యార్థులకు ప్రతి రోజు ఐరన్ మాత్రలు వాడుతున్నారా లేదా అని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి టి.నాగేశ్వరరావు, పిహెచ్ఎన్ ఎం రత్న సఖి, హెల్త్ సూపర్వైజర్ ఎస్ఎస్ వి ప్రకాష్,హెల్త్ విజిటర్ ఎస్.సూర్య కుమారి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు పిఎన్వి ఎస్ ప్రసాద్, బి.ప్రేమ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ ఎన్ రాజేశ్వరి పాల్గొన్నారు.