సన్మానిస్తున్న దృశ్యం
ఎంపీడీఓ హేమలతకు సన్మానం..!
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా పనిచేస్తూ డిఎల్డిఒగా ఉద్యోగోన్నతి పై (నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి)గా వెళ్లిన కన్నం హేమలతకు బుధవారం ఘన సన్మానం జరిగింది. నూతన ఎంపీడీఓ ప్రత్యూష ఆధ్వర్యంలో హేమలతకు వీడ్కోలు, అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఉప్పల స్వర్ణలత అధ్యక్షత వహించారు. సమావేశంలో మండల వైసిపి అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి మన్నెం చిరంజీవి గౌడ్, ఇఒపిఆర్డి నారాయణరెడ్డి, ఎంపీటీసీ కోణతం రఘుబాబులు సన్మాన గ్రహీత హేమలత మండలాభివద్ధికి చేసిన కషిని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఏడు సంవత్సరాలు సుదీర్ఘకాలం మండలంలో పనిచేసిన అందరి మన్ననలను పొందిన ఘనత హేమలతకే దక్కుతుందన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకు అందరూ తనకు సహకరించాలని ఎంపీడీఓ ప్రత్యూష కోరారు. దీనికి ముందు డిఎల్డిఓ హేమలతను శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సన్మానం మరువలేనిదని అందరి సహకారంతో తన బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లు హేమలత తెలిపారు. తాను ఎక్కడ ఉన్న తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శేషమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసులు నాయుడు అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.










