Nov 16,2023 18:35

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
  బసుదేవ ఆచార్య ఎల్‌ఐసి సంస్థ కోసం అహర్నిశలు శ్రమించారని ఎల్‌ఐసి ఆలిండియా ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ స్టేట్‌ సెక్రటరీ జి.రవి కిషోర్‌ తెలిపారు. ఎల్‌ఐసి వ్యవస్థాపక అధ్యక్షులు, సిఐటియు జాతీయ నాయకులు బసుదేవ ఆచార్య సంతాపసభ ఏలూరు బ్రాంచ్‌ ఆఫీస్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాంచ్‌ అధ్యక్షులు పి.శ్రీరాంప్రసాద్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఏజెంట్స్‌ కోసం దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్‌ స్థాపించారన్నారు. సుదీర్ఘకాలం ఆయన ఏజెంట్స్‌ కోసం పోరాడారన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థను ప్రయివేటీకరణ చేయాలని చూస్తే, బసుదేవ ఆచార్య పార్లమెంట్‌లో దాన్ని అడ్డుకోవడం కోసం అనేక పోరాటాలు రూపొందించారన్నారు. ఆయన మృతి ఆర్గనైజేషన్‌కు తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి వైఎస్‌.కనకారావు, ఆల్‌ ఇండియా కౌన్సెల్‌ సభ్యులు డివి.రామకృష్ణ, జోనల్‌ ఇసి మెంబర్‌ బి.రామ్మోహన్‌రావు, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు సుధాకర్‌, సభ్యులు పాల్గొన్నారు.