Nov 15,2023 21:25

  భీమడోలు : దిశయాప్‌ సేవలు వినియోగించుకోవాలని భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్‌ కోరారు. దిశయాప్‌పై అవగాహన కల్పించేందుకు మండల వ్యాప్తంగా బుధవారం మెగా క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముదినేపల్లి : బుధవారం ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దిశ యాప్‌పై యువకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ పద్మజ, పోలీసులు పాల్గొన్నారు.