Nov 01,2023 01:12

సత్తెనపల్లి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్దవంతంగా అధికారులు అమలు చేయాలని సత్తెనపల్లి ఎంపీపీ యలవర్తిపాటి షేక్‌ జైబూన్‌ బీ అన్నారు.సత్తెనపల్లి మండల ప్రజా పరిషత్‌ సర్యసభ్య సమావేశం మండల పరిషత్‌ అధ్యక్షురాలు షేక్‌ జైబున్‌ బీ అధ్యక్షతన మంగళవారం జరిగింది. అసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ చలికాలం లో డెంగీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది, పంచాయతీ అధికారులు తగు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు కళ్ళం విజయ భాస్కర్‌ రెడ్డి, ఎంపిడిఓ జీ వీ సత్యనారాయణ,పంచాయతీ రాజ్‌ విస్తరణ అధికారి దయాసాగర్‌ మాట్లాడారు. గ్రామాల్లో కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ నిర్మాణాలను చేపట్టాలని కోరారు. కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పెండెం బాబురావు తదితరులు పాల్గొన్నారు.