Nov 02,2023 00:24

పల్నాడు జిల్లా: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని సాం ఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం,ఆనంద నిలయం వసతిగృహాలను జాయింట్‌ కలెక్టర్‌ సందర్శించారు.ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ విశ్రాంత ఉద్యోగి జూపూడి ప్రసాద్‌ తన తల్లిదండ్రులు జూపూడి డేవిడ్‌ , నాగమ్మ జ్ఞాప కార్ధంగా రూ.40 వేలు విలువైన శుద్ధ జల యంత్రం, 2 సిం టెక్స్‌ ట్యాంక్‌ లు పైపులు వితరణ చేశారు. ఆయా వసతి గృహా లకు రంగులు వేసేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జూపూడి ప్రసాద్‌ ను జాయింట్‌ కలెక్టర్‌ అభినందించారు. ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరు సేవా భావంతో ముందుకు రావాలని, వసతి గృహాల్లో ఉండి విద్య నభ్యసిస్తున్న పేద పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.