Apr 17,2023 15:59

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లు పాల రామకృష్ణ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండారు శివ మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 4. సం అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధి నామమాత్రమేనన్నారు.  ఎక్కడే గాని ప్రాజెక్టులనిర్మాణం లేదు.ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాష్ట్రానికి రావలసిన నిధులను రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ పోతుంది. ఒక  విద్యుత్ పంపు చెట్లకు  మీటర్లు బిగించే విధానం.విద్యుత్ చార్జీల పెంపు చెత్త పన్ను.ఆస్తి పన్ను. నీటి పన్ను. డ్రైనేజీ ఈ విధంగా అనేక రకాలుగా బారాలు ఇప్పుడేమో రాష్ట్ర సంపద.పోర్టులు.థర్మల్ విద్యుత్ కేంద్రాలు. సోలార్ విద్యుత్. ఒప్పందాలు గంగవరం.కృష్ణపట్నం పోర్టు లను ఆ దాని కంపెనీలకు కట్టబెట్టారు. కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన గంగవరం పోర్టును కేవలం 625 కోట్లకు ఆదాని కంపెనీకి కట్టబెట్టారు ఆదాని కంపెనీలకు ఆస్తులు కట్టబెట్టడంలో రాష్ట్రం మోగ్గు చూపుతుంది. ఇప్పటికే ఆదాని కంపెనీలలో కోట్లకు కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు హిండేబర్గ్ నివేదిక ఇచ్చింది. ప్రజలకు దక్కాల్సిన ఆస్తులు.ఆదాయ వనరులన్నీ ఆదానికి అప్పగించడం విధానాన్నితీవ్రంగా సిపిఐగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజవర్గం ఉప అధ్యక్షుడు బి, రామాంజనేయులు, గోపాల్ నాయక్ , చౌడప్ప, నల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.