షాన్విని అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు అర్బన్ :
చిత్తూరు పట్టణం ఒబనపల్లి మోహన్రెడ్డి, పల్లవి దంపతుల గారాల పట్టి షాన్వీ. చిన్న వయస్సులోనే వివిధ దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలను, వ్యక్తులను, ఆహార పదార్ధాలను, వాహనాలను, నిష్ణాతులను, సముద్ర జంతువులను, శరీరంలోని భాగాలను గుర్తించి చెబుతుండడంతో ఆ చిన్నారి ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. కలెక్టర్ తన ఛాంబర్లో సర్టిఫికేట్ను చిన్నారికి అందించి ఆశీర్వదించారు.










