
యడ్లపాడు: ప్రజా సమస్యలే ఎజెండాగా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు అమలు చేయాల్సిన ప్రజాప్రణాళికను సిపిఎం ప్రజలముందు ఉంచు తుందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సిపిఎం ప్రజారక్షణ భేరి ప్రజార జాత నిర్వహించారు. తిమ్మాపురం, దింతెనపాడు,సందెపూడి,తుర్లపాడు, జాలాది, జగ్గాపురం, కారుచోల, గుత్తావారిపాలెం, యడ్లపాడు, వంకాయలపాడు, బోయపాలెం,ఉన్నవ గ్రామాల్లో నిర్వహించిన ప్రజార జాతా నిర్వహిం చారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని , రాజ్యాంగాన్ని కాపా డటం కోసం సిపిఎం కృషి చేస్తోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపి విధానాలకు నిరసిస్తూ కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకొని సిపిఎం పోరాడు తుందని స్పష్టం చేశారు. రైౖతులు ,కార్మికులు , మహిళలు, విద్యార్థులు చేసే పోరాటాలకు సిపిఎం అండగా నిలబడుతుందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడం ద్వారానే రాష్ట్రాల హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను , మానవహక్కుల ను కాపాడుకోగలమని అన్నారు. ఆయా చోట్ల జరిగిన జాతాలో సిపిఎం మండల కన్వీనర్ తోకల కోటేశ్వర రావు, సిపిఎం నాయకులు నూతలపాటి కాళిదాసు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, కారుచోల రోశయ్య, జరుగుల శంకరరావు,విల్సన్, పి.శ్రీను పాల్గొ న్నారు.
ప్రజాశక్తి-నకరికల్లు
సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణభేరి ప్రచార జాతర మండలంలోని నకరికల్లు, నరసింగపాడు బాలాజీ నగర్ తండా గుండ్లపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ సంద ర్భంగా పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, ప్రతి ఎకరాకు సాగు నీరు, మోటార్లకు ఉచిత విద్యుత్, ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు అందజేయాలన్నారు. నవంబర్ 15న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం తహశీల్దార్ నగేష్ కు భూ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడిద మల్ల పిచ్చారావు, ఈవురి లక్ష్మారెడ్డి, గోదా చిన్ని పాల్గొన్నారు.