
ఏలూరు టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కులను కాపాడటానికి అనేక చట్టాలను, కార్యక్రమాలని అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా పెదవేగి మండలం ఎస్ఎంసి స్కూల్, కూచిపూడి ప్రభుత్వ పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఒ నాగరాజు, ఎంఇఒ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.