
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : బాల్యం..భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరమని వి ద్యాశాఖ అధికారి-3 డి. జయ రామానాయుడు పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలం లోని పాఠశాలల్లో మంగళవా రం ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు జరిగాయి. సౌత్ ఆములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యులు షేక్. అహ్మద్ బాషా అధ్యక్షతన జరిగిన బాలల ది నోత్సవం వేడుకలకు ఎంఇఓ జయరామా నాయుడు ము ఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మా ట్లాడుతూ అభం శుభం తెలి యని పసి మనసులు పూతో టలో అప్పుడే పరిమళించిన పువ్వులని అభివర్ణించారు. అందుకు సూచకంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో బా లల దినోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటారని జయరామా నాయుడు తెలిపా రు. భారత మాజీ ప్రధాని జవ హర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగు తుందన్నారు. పిల్లలు బాల్యం నుండే చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని ఎంఇఓ సూచిం చారు. హెచ్.ఎం అహ్మద్ బా షా మాట్లాడుతూ నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యా న్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారని చెప్పారు. పి ల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారన్నారు. చిల్డ్రన్స్ డే ను పురస్కరించు కొని విద్యార్థులు అద్భుతంగా ఉపన్యసించారు. అలాగే ప్రద ర్శించిన నత్యాలు, సాంస్క తి కార్యక్రమాలు అందరిని ఎం తగానో ఆకట్టుకొన్నాయి. సజ నాత్మక అంశాలు నేర్పించడం లో సహకరించిన పాఠశాల ఉ పాధ్యాయులకు అహ్మద్ బాషా ప్రత్యేక అభినందనలు తెలియ జేశారు. నెహ్రూ వేషధారణలో పిల్లలు అందరినీ ఆకర్శించా రు. అనంతరం నెహ్రూ వేష ధారణ, డ్రాయింగ్, వకత్వ పో టీలు, నత్య ప్రదర్శనలలో గె లుపొందిన వారికి ఎంఈఓ-2 బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ''ప్రజాశక్తి'' ప్ర చురించిన పిల్లల ప్రత్యేక సంచి క ''చిరుమువ్వలు'' అనేది పు స్తకాన్ని ప్రదర్శించారు. జరిగిం ది. పిల్లలు పాఠశాల ఆవర ణలో మొక్కలు నాటారు. కా ర్యక్రమంలో పాఠశాల ఉపా ధ్యాయులు ఎం. మురళి, కె. వసంత లక్ష్మి, కె .హెప్సీ విద్యు ల్లత, బి. కష్ణవేణి పాఠశాల వి ద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రా మస్థులు పాల్గొన్నారు.