
ప్రజాశక్తి-సబ్బవరం
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ మండలంలోని ఆసకపల్లి గ్రామంలో బాబుతో నేను అన్న కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ కరణం రామునాయుడు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గండి రవి కుమార్, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, కరణం రామునాయుడు, బర్ణికాన బాబురావు, రేసుపూడి రమణ, గవర అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని తానాం, కన్నూరు, పెదముషిడివాడ గ్రామాలలో టిడిపి నాయకులు శుక్రవారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అట్టా సన్యాసప్పారావు, బోండా తాతారావు, ఇందల కొండలరావు, రొంగల గోపాలకృష్ణ, గొల్లవిల్లి నాగేశ్వరావు, పెద ముసిడివాడ ఎంపీటీసీ ఓమ్ని వెంకటరావు, బంధం వెంకటరమణ పాల్గొన్నారు.
రోలుగుంట : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రోలుగుంట మండలం ఎంకే.పట్నం పంచాయతీ శివారు సింగరాజు పేట గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బత్తుల తాతిబాబు, ఎంపిటిసి ఎస్.కృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు చంద్రమౌళి హాజరై మాట్లాడారు.
ఆరిలోవ : 12వ వార్డులో టిడిపి ఇన్చార్జ్ ఒమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో ఈశ్వరిదేవినగర్, బాల మురళీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసారు. పదో వార్డులో టిడిపి అధ్యక్షులు గాడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో వివేకానందనగర్, ఎస్ఐజి నగర్ ప్రాంతాల్లో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు.
రచ్చబండ
అనకాపల్లి : మండలంలోని సత్యనారాయణ పురంలోనూ, గవరపాలెం పార్టీ కార్యాలయంలో శుక్రవారం టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వేర్వేరుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రం నుంచి చంద్రబాబును దూరం చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు కెకెవిఎ.నారాయణరావు, కడిమిశెట్టి నర్సింగరావు, ధనాల విష్ణు చౌదరి, కుప్పిలి జగన్, బోడి వెంకట్రావు, విల్లూరి రమణబాబు, పొలిమేర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని చౌడువాడలో గురువారం రాత్రి బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ప్రజా వేదిక నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టిడిపి నియోజకవర్గం ఇన్ఛార్జి పివిజి.కుమార్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను అడ్డుపెట్టుకొని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కార్యక్రమంలో చౌడువాడ సర్పంచి దాడి ఎరుకునాయుడు. టిడిపి నాయకులు ఎం.గోవిందరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కాగడాల ప్రదర్శన
తగరపువలస : టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబు, మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భీమిలి మండలం, దాకమర్రిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్ రాజు, నాయకులు ఎస్ ప్రకాష్, తమ్మిన వెంకట రమణ పాత్రుడు, అల్లు చిన్నయ్య, పతివాడ రాంబాబు, యరబాల అనిల్ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం గ్రామకూడలి వద్ద 'బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ' పేరిట ప్రజావేదిక సభ నిర్వహించారు. జివిఎంసి మూడో వార్డులో 'బాబుతో మేము' సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, మాజీ కౌన్సిలర్లు పి లక్ష్మీకుమారి, ఎ గురునాథ్, సిహెచ్ రమణ, నాయకులు కొక్కిరి అప్పన్న పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : రానున్న ఎన్నికల్లో వైసిపి అడ్రస్ గల్లంతు కావడం తథ్యమని టిడిపి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎం.శ్రీ భరత్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్లమెంట్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే, దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ పాల్గొన్నారు.