
నకరికల్లు: సాగర్ లో ఉన్న నీళ్లు ఆరుతడి పం టలకు విడుదల చేసి రైతులను ఆదుకోవా లని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుం టూరు విజయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కుంకల గుంటలో మూడో రోజు ప్రజా చైతన్య యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ కోట్లాది మంది తెలుగు ప్రజలు సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేj ుకుండా ఆపాలన్నారు. ఈనెల 7వ తేదీన బస్సు యాత్ర సత్తెనపల్లి చేరుకుంటుందని చెప్పారు. నవంబర్ 15వ తేదీన విజయ వాడలో జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అనుముల లక్ష్మేశ్వర్ రెడ్డి, శివకుమారి, షేక్ సిలార్, తాళ్లూరి పెద్ది రాజు, గుంటూరు మల్లేశ్వరి, ఈ ఊరి అప్పిరెడ్డి, లక్ష్మారెడ్డి, జి.పిచ్చారావు, చట్టు కోటేశ్వరరావు, దుర్గాబాయి, ఆవుల వెంక టేశ్వర్లు, గుంజి కొండలు పాల్గొన్నారు
వరి రైతులను ఆదుకోండి
క్రోసూరు: లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా క్రోసూరు చెరువు నింపి ఎద్దు వాగుకు వదలడం ద్వారా దాని పరీవాహక ప్రాం తంలో వరి సాగు చేసే రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు కోరారు. సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మండలంలోని బాలమర్రు, అందుకూరులలో బుధవారం జరిగింది. ఎద్దు వాగు పరీవాహ ప్రాంతమైన అందుకూరు, బాలెమర్రు ,బయ్యవరం గ్రామాల్లో ఆరేడు వందల ఎకరాల వరి సాగు చేసి ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టారని, ఎద్దు వాగు ఎండిపోవడంతో సాగునీరు అందక పంటలను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పంటలను కాపాడటానికి కృష్ణా నది మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా క్రోసూరు చెరువు నింప,ి ఎద్దు వాగుకు నీటిని వదలాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న కందిపప్పు కూడా కరువైందని, విద్యుత్ ఛార్జీలు తీవ్రంగా పెరిగాయని వ్యవసాయ కార్మిక మహిళలు చెప్పారని అన్నారు. అదేవిధంగా జగనన్న కాలనీలకు ఇస్తున్న ఉపాధి హామీ డబ్బుల బిల్లులు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. దేశాన్ని అప్పుల పాలు చేస్తూ, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేస్తోందని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. అటువంటి మోడీ ప్రభుత్వానికి వంతపలుకుతున్న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం చేపట్టే ఆందోళన, ఉద్యమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాచైతన్య యాత్రలో సిపిఎం మండల కార్యదర్శి తిమ్మిశెట్టి హనుమంతరావు, ఏపూరి వెంకటేశ్వర్లు, చిలక యేసయ్య, డి. నటరాజ్ , షేక్ ముస్తఫా, జి.చిన్నప్ప పాల్గొన్నారు.