
ప్రజాశక్తి -యంత్రాంగం
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల చెంతకు వైద్యం అందుతుందని నాయకులు, అధికారులు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
పిఎం పాలెం: ప్రజల చెంతకు స్పెషలిస్ట్ వైద్యసేవలు అందించే ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. గురువారం ఆరోవార్డు రిక్షా కాలనీలో ఆరోగ్యసురక్ష శిబిరంలో స్తానిక కార్పొరేటర్ లక్ష్మిప్రియాంకతో కలిపి పాల్గొన్నారు. కంటి వైద్యశిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్నవారికి కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, 6,7 వార్డుల వైసిపి అధ్యక్షులు బొట్టా అప్పలరాజు, పోతిన శ్రీనివాస్, అల్లాడ లింగేశ్వరరావు, సంజీవ్, వార్డు మహిళా అధ్యక్షురాలు కొండపల్లి వరలక్ష్మి పాల్గొన్నారు.
పద్మనాభం: మండలంలోని బి.తాళ్లవలస ఉన్నతపాఠశాల వద్ద నిర్వహించిన ఆరోగ్యసురక్ష వైద్యశిబిరంలో బొత్సపేట.బి.తాళ్లవలస గ్రామాలకు చెందిన 665 మందికి బిపి, సుగర్, ఇతరత్రా వైద్యపరీక్షలు నిర్వమించిన మందులు అందజేశారు. వైద్యశిబిరాన్ని ఎంపిపి కె.రాంబాబు సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ చందక శ్రీను, ఎంపిడిఒ ఎం.విజయకుమార్, వైసిపి మండల అధ్యక్షుడు కె లక్ష్మణరావు పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 43వ వార్డు శ్రీనివాసనగర్లోని నరసింహనగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో గురువారం ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. యుపిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ తనూజ పర్యవేక్షణలో స్పెషలిస్టు వైద్యులు రాకేష్, శరత్, సుజిత్ బోస్ పాల్గొని, 271 మందికి వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశారు. ఆఫ్తాల్మిక్, దంత వైద్య సేవలు కూడా అందజేసారు. 16 మందిని కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు వైసిప ఉత్తర సమన్వయకర్త కెకె.రాజు, జివిఎంసి ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాసరావు, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పాల్గొన్నారు.
రావికమతం:జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేద ప్రజలకు వరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అన్నారు. మండలంలో మరుపాక సచివాలయ పరిధిలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 418 మంది రోగులు హాజరయ్యారు. వైద్యులు దుర్గాప్రసాద్, ప్రియాంక, ప్రవీణ్, మోహిని, సురేఖ, విజరు రాజ్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ, పేద ప్రజలకు క్షేత్రస్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీర్ఘకాలిక రోగులను సైతం పరీక్షించి మెరుగైన ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్న బాబు, తహసిల్దారు మహేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కోటవురట్ల:ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని తహసిల్దార్ జానకమ్మ కోరారు. చౌడవాడ సచివాలయ పరిధిలో సురక్ష కార్యక్రమం ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు పర్యవేక్షణలో నిర్వహించారు. 250 మంది కి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపాలకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లి : మండలంలో కొత్తూరు, అనకాపల్లి పట్టణంలోని నెయ్యల వీధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం పరిశీలించారు. కొత్తూరులో 255 మందికి, నెయ్యల వీధిలో 113 మందికి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏపీఐడబ్ల్యూఎ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, జోనల్ కమిషనర్ వెంకటరమణ, డిఎంహెచ్వో డాక్టర్ హేమంత్, ఎంపీపీ సూరిబాబు, వైసిపి నేతలు మళ్ల బుల్లిబాబు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, కోరుకొండ రాఘవ పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండలంలో కలిగొట్ల గ్రామంలో నిర్వహించిన జగనన్న అరోగ్య సురక్ష శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం పరిశీలించారు. వైద్య సేవల నిమిత్తం శిబిరాలను వచ్చిన వృద్ధులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రి సత్యం, వైసీపీ మండల అధ్యక్షులు బూరె బాబురావు, సర్పంచ్ సుధారాణి, ఎంపీటీసీ అర్.లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పిపి అగ్రహారంలో గురువారం జగనన్న సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సందర్శించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి దొండ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు కొల్లిమల్ల అచ్చం నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గొలుగొండ:జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం పేదలకు వరమని గొలుగొండ ఎంపిపి గజ్జలపు మణికుమారి అన్నారు. జోగుంపేటలో జగనన్న ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వైద్యులు గ్రామస్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైసిపి అధికార ప్రతినిధి జక్కు అప్పలస్వామినాయుడు, సర్పంచ్ జువ్వల లక్ష్మీ, ఎంపిడిఒ డేవిడ్రాజు పాల్గొన్నారు.