Mar 28,2022 23:07

అంజూరును సత్కరిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి :
వైసీపీ జిల్లా అధికారప్రతినిధి, ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ అంజూరు శ్రీనివాసులును యూటీఎఫ్‌ నాయకులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ అంజూరు దూరదృష్టి గల వ్యక్తింటూ కొనియాడారు. అన్ని విషయాలపై అవగాహన కల్గిన వ్యక్తి పదవిలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. శ్రీనివాసులు, శివకుమార్‌, విజరుకుమార్‌, మోహన్‌బాబు, గోపి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.